News March 23, 2025
NRPT: జిల్లా క్రీడాకారునికి బ్రాంజ్ మెడల్

నారాయణపేట జిల్లా దామరగిద్ద చెందిన కనకప్ప పారా అథ్లెటిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్ విభాగం నందు పాల్గొన్న కనకప్ప 5.30 మీటర్స్ దూకి, ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు రమణ వివరించారు. నారాయణపేట జిల్లాకు చెందిన అభ్యర్థి పతకం సాధించడం పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు,పీడీలు, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 26, 2025
నెల్లూరు జిల్లాలోని HM, టీచర్లకు గమనిక

నెల్లూరు జిల్లాలోని ZP ప్రభుత్వ మున్సిపాలిటీ, మండల పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 28వ తేదీలోగా తెలియజేయాలని డీఈఓ డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్సైట్, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉందన్నారు.
News March 26, 2025
పల్నాడు: మంత్రి పదవి రేసులో యరపతినేని.?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావుకు ప్రాతినిధ్యం కల్పించాలని TDP కార్యకర్తలు బలంగా వాదన వినిపిస్తున్నారు. MLC నాగబాబుకు మంత్రి మండలిలో చోటు కల్పించేందుకు విస్తరణ చేపట్టనున్నారు. క్యాబినెట్లో పల్నాడుకు ప్రాతినిధ్యం లేదు. గురజాల నుంచి వరుసగా 7 సార్లు పోటీ చేసి TDPలో 3 తరాలతో పనిచేసిన యరపతినేనికి మంత్రి మండలిలో బెర్త్పై ప్రచారం జరుగుతోంది.
News March 26, 2025
మంగళగిరి: అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్

అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీసు స్టేషన్లో శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. అఘోరితో కలిసివచ్చి శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు, కేర్టేకర్ విష్ణుతో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఇష్ట పూర్వకంగానే అఘోరిగా మారినట్లు శ్రీవర్షిణి తెలిపింది.