News March 23, 2025
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: షీ టీం ఎస్ఐ సునంద

మహబూబాబాద్ జిల్లా సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మహిళా ఫార్మసీ కళాశాలలో షీ టీం ఎస్ఐ సునంద పలు విషయాలపై శనివారం అవగాహన కల్పించారు. నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. జాగ్రత్తగా మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
మరణంలోనూ వీడని బంధం.. ఒకేరోజు భార్యాభర్తల మృతి

నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలోని ఆరువేటి లక్ష్మీనారాయణ (85), వెంకట లక్ష్మమ్మ (80) దంపతులు ఒకే రోజు మరణించారు. 60ఏళ్ల వివాహ బంధంలో ఒకరికొకరు తోడుగా ఉన్న వారు అనారోగ్యం కారణంగా వారిద్దరూ ఆదివారం మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా ఉందని, ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచిందని పేర్కొన్నారు. స్థానికులు నివాళి అర్పించారు.
News October 20, 2025
భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు దీపావళి వేళ భారీ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 549 పాయింట్ల లాభంతో 84,501, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,869 వద్ద స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్ కాగా ICICI బ్యాంక్, JSW స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ONGC టాప్ లూజర్స్.
News October 20, 2025
వనపర్తి: దీపావళి.. ఎస్పీ కీలక సూచనలు

✓ పిల్లలను పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చనివ్వాలి.
✓ రహదారులపై లేదా ఇళ్ల ముందు గుంపులుగా టపాసులు కాల్చవద్దు.
✓ టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా నిలబడాలి.
✓ వెలగని టపాసులను మళ్లీ వెలిగించకూడదు.
✓ నీరు, ఇసుక బకెట్ దగ్గర ఉంచుకోవాలి.
✓ టపాసుల గోదాములు, విక్రయ కేంద్రాలు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలి.
✓ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే డయల్ 100 లేదా 101 నంబర్లకు సమాచారం ఇవ్వాలి.