News March 23, 2025

సిద్దిపేట: యువతి అదృశ్యం- మిస్సింగ్ కేసు నమోదు

image

యువతి అదృశ్యమైన ఘటన వర్గల్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాచారం గ్రామానికి చెంది పర్స కృపారాణి (20) శుక్రవారం గ్రామంలోని కుట్టు మిషన్ నేర్చుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలో, బంధువుల వద్ద ఆచూకీ కోసం వెతికిన కనిపించలేదు. శనివారం యువతి తండ్రి పర్స స్వామి ఫిర్యాదు మేరకు గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 27, 2025

VZM: జర్మనీలో ఉద్యోగాలకు 30న జాబ్ మేళా

image

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. జర్మనీలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం అక్టోబర్ 30న విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.2.60 లక్షల వరకు టాక్స్ ఫ్రీ వేతనం, ఉచిత వసతి, వైద్యం, రవాణా సదుపాయం కల్పించబడుతుందని ఆయన తెలిపారు.

News October 27, 2025

GNT: తుపాను నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నారా..?

image

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పిల్లలకు పాలు, అవసరమైన వస్తువులు, నిత్యవసర సరుకులు కూరగాయలు సిద్ధం చేసుకోవాలి. విద్యుత్ అంతరాయం కలిగినా తుపాను అప్డేట్స్ తెలుసుకునేందుకు సెల్ ఫోన్స్ చార్జింగ్, ఇంట్లో వాటర్ ట్యాంకర్లు నిండుగా ఉంచుకోవాలి.

News October 27, 2025

HYD: డీప్‌ఫేక్ కేసులో విచారిస్తున్నాం: సీపీ

image

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని, సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు.