News March 23, 2025
విశాఖలో హత్య కేసు రీ ఓపెన్.. అనకాపల్లి వ్యక్తి అరెస్ట్

విశాఖలో 2021లో జి.శ్రీను అనే వ్యక్తి మర్మాంగం కోసి రోడ్డుపై హత్య చేశారు. ఈ హత్యపై ఎలాంటి ఆధారాలు లేక అప్పుడు క్లోజ్ చేశారు. ప్రస్తుతం విశాఖ పోలీసులు ఈ కేసును రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను అనకాపల్లి జిల్లా రాంబిల్లి మం. జంగవాని పాలేనికి చెందిన లాలం గణేష్, పెద్ద గంట్యాడకు చెందిన తారకేశ్వరరావు చేసినట్లు గుర్తించారు. దీంతో శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.
Similar News
News March 26, 2025
యూజర్లకు షాక్: త్వరలో రీఛార్జ్ ధరల పెంపు?

త్వరలో వినియోగదారులకు టెలికామ్ కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొబైల్ రీఛార్జ్ ధరలను సవరించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ ఛార్జీల పెంపు వల్ల టెలికాం కంపెనీలకు మరింత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. 2019లో ఓసారి, 2021లో ఓసారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు (2019 DECలో, 2021 NOVలో, 2024 JULYలో) టారిఫ్లను పెంచాయి.
News March 26, 2025
HYD: రైళ్లలో హై అలర్ట్.. ఎక్కడికక్కడ పోలీసులు!

MMTS రైలులో జరిగిన ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అప్రమత్తమైంది. HYD, సికింద్రాబాద్ సహా SCR పరిధిలో నడిచే అన్ని రైళ్లలో ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతపై ఫోకస్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
News March 26, 2025
భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ప్రశంసలు.. ఎందుకంటే!

భారత్ సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదుకు పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ‘స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతలో వర్ధమాన దేశాలతో పోలిస్తే US విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్ డేటాబేస్ (ఆధార్)తో ఓటరు గుర్తింపును ముడిపెట్టాయి’ అని ఆయన వివరించారు.