News March 25, 2024

కరీంనగర్: రంగుల విషయంలో జాగ్రత్త!

image

చిన్నా, పెద్ద, ధనిక, పేద, కుల, మత భేదాలు లేకుండా చేసుకునే పండగల్లో హోలీ ప్రధానమైంది. జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ బంధువులు, మిత్రులపై రంగులు చల్లుతూ.. ఆనందోత్సాహాలతో ఈ వేడుక నిర్వహించుకుంటారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సహజ రంగులు కాకుండా రసాయనాలు ఉండే రంగులు ఎక్కువకాలం శరీరంపై ఉండేవి కళ్లు, చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Similar News

News October 24, 2025

KNR: గదిలో గంజాయి దాచి.. స్నేహితులతో సేవించి

image

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయివిఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్‌పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడితోపాటు గంజాయిని నిన్న పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

News October 24, 2025

JMKT: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

జమ్మికుంట పత్తి మార్కెట్లో నేటి నుంచి CCI ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా అయితేన్ మద్దతు ధర పొందవచ్చన్నారు. CCI ద్వారా పత్తి అమ్ముకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావాలన్నారు. సమస్యలుంటే 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించండి.

News October 24, 2025

కరీంనగర్: పరీక్ష కేంద్రం ఆకస్మిక తనిఖీ

image

శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 17 నుంచి LLB కోర్సులో 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రమైన ఆర్ట్స్ కళాశాలను VC యూ.ఉమేష్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం వాల్యూయేషన్ కూడా త్వరగా చేపట్టి ఫలితాలను సకాలంలో ప్రకటిస్తామని తెలిపారు.