News March 25, 2024
తూ.గో జిల్లాలో విస్తృతంగా ఉపాధి పనులు

తూ.గో జిల్లాలో ఉపాధిహామి పనులు విస్తృతంగా చేపడుతున్నట్లు డ్వామా పీడీ ఎం.ముఖలింగం తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. జనవరి నెల వరకూ కూలీలకు బిల్లులు అందజేశామని అన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ఈ పథకం అమలుపై గ్రామ స్థాయి నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందడం లేదన్నారు. కూలీలతో పాటు, మెటీరియల్ కాంపొనెంట్ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు వివరించారు.
Similar News
News March 13, 2026
రాజమండ్రిలో అమృత భారత్ ఎక్స్ప్రెస్ హాల్ట్

చర్లపల్లి-కామాఖ్య అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా కనెక్టివిటీ లభించింది. ఈ రైలు శుక్రవారం మార్చి 13 నుంచి రాజమండ్రి స్టేషన్లో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, విజయనగరం జంక్షన్ వంటి నగరాలను ఈ రైలు అనుసంధానిస్తోంది. దీనివల్ల జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడంతో పాటు కామాఖ్య ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.
News March 13, 2026
రాజమండ్రిలో అమృత భారత్ ఎక్స్ప్రెస్ హాల్ట్

చర్లపల్లి-కామాఖ్య అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా కనెక్టివిటీ లభించింది. ఈ రైలు శుక్రవారం మార్చి 13 నుంచి రాజమండ్రి స్టేషన్లో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, విజయనగరం జంక్షన్ వంటి నగరాలను ఈ రైలు అనుసంధానిస్తోంది. దీనివల్ల జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడంతో పాటు కామాఖ్య ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.
News March 13, 2026
జాతీయ టీటీ పోటీలకు రాజమండ్రి వైష్ణవి సూర్య ఎంపిక

ఇండోర్లో మార్చి 14 నుంచి 21 వరకు జరగనున్న 87వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలకు రాజమండ్రి క్రీడాకారిణి వై. వైష్ణవి సూర్య ఎంపికయ్యారు. ర్యాంకింగ్ పోటీల పాయింట్ల ఆధారంగా రాష్ట్ర సీనియర్ మహిళల జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. గురువారం జిల్లా టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు జెవీవీ అప్పారెడ్డి, కోశాధికారి కె.సత్యనారాయణ, కోచ్ సుబ్బారావు ఆమెను అభినందించారు.


