News March 23, 2025

మహబూబాబాద్: బెట్టింగ్ భూతం.. తీస్తుంది ప్రాణం!

image

ఐపీఎల్ మొదలు కావడంతో ఇప్పుడు అందరి నోటా బెట్టింగ్ మాటే. ఆటను అస్వాదించే వాళ్లు కొందరైతే, వ్యసనమై బెట్టింగ్‌లో రూ.లక్షల్లో నష్టపోయి SUICIDE చేసుకునే వాళ్లు కోకొల్లలు.ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు బెట్టింగ్‌లపై నిఘా పెట్టారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాల్సిన బాధ్యత ఉందన్నారు.

Similar News

News November 4, 2025

మంచిర్యాల: ‘వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి’

image

వరి ధాన్యం కొనుగోలు కొరకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో, 97 డీసీఎంఎస్ ఆధ్వర్యంలో, 63 మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేడ్ ఏకు క్వింటాల్‌కు రూ.2,369, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు.

News November 4, 2025

కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

image

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.

News November 4, 2025

లక్షెట్టిపేట: మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు: కలెక్టర్

image

మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, ఏఎంసీ ఛైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ ఛైర్మన్ ఎండీ ఆరిఫ్, తహశీల్దార్ దిలీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలమెల రాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పింగళి రమేశ్ ఉన్నారు.