News March 25, 2024
HYD: శిల్పారామంలో మైమరిపించిన నాట్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711307522018-normal-WIFI.webp)
కళాకారులు భరతనాట్య ప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. HYD మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న వారాంతపు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఐశ్వర్యవల్లి శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, గరుడగమన, పంచమూర్తి కౌతం, జతిస్వరం, గణేశపంచరత్న, చండ్రచూడ శివశంకర, మురళీధర కీర్తనం, దశావతారం, అదివో అల్లదివో తదితర ప్రదర్శనలతో అలరించారు.
Similar News
News July 8, 2024
HYD: ప్లాస్టిక్ సర్జరీలపై ప్రత్యేక సేవలు: డా.లక్ష్మీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720428844575-normal-WIFI.webp)
ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.
News July 8, 2024
HYD: శిథిలావస్థలోని భవనాలపై చర్యలేవి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421692755-normal-WIFI.webp)
గ్రేటర్ HYD పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది అధికార గణంకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 620 భవనాలు శిథిలంగా మారాయి. సికింద్రాబాద్లో అత్యధికంగా 155, ఎల్బీనగర్లో 119, చార్మినార్లో 89, ఖైరతాబాద్లో 109, శేరిలిం గంపల్లిలో 62, కూకట్పల్లిలో 92 శిథిల భవనాలు ఉన్నాయి. ఈ భవనాల స్థితిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.
News July 8, 2024
HYD నుంచి స్వర్ణగిరికి వెళ్లే బస్సుల TIMINGS ఇవే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720419407423-normal-WIFI.webp)
HYD నుంచి యాదాద్రి సమీపంలోని స్వర్ణగిరి టెంపుల్కి రెండు ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ ప్రెస్, నాన్ ఏసీ బస్సులను RTC నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు బస్ టైమింగ్స్ విడుదల చేశారు. సికింద్రాబాద్ JBS నుంచి ఉ.7, 8, మ.2.50, 3.50 గంటలకు బయలుదేరుతాయని, తిరిగి స్వర్ణగిరి నుంచి JBSకు మ.12.10, 1.10, రా.8, 9 గంటలకు బస్సులుంటాయన్నారు. JBS నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.80 టికెట్ ధరగా నిర్ణయించారు.