News March 23, 2025
WNP: చికిత్స పొందుతూ వివాహిత మృతి

ఆత్మకూర్ మండలంలో ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. బాలకృష్ణాపుర్కి చెందిన రాధ(34) గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పిని భరించలేక ఈనెల 10న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు HYDలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులపాటు చికిత్స పొందుతూ నిన్న మృతిచెందింది.
Similar News
News September 13, 2025
నకిరేకల్లో విద్యార్థినికి లైంగిక వేధింపులు..!

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ టీచర్ విద్యార్థినిని వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా రాజీ చేసేందుకు కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రయత్నించినట్లు తెలిసింది. బాధితురాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 13, 2025
1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్లైన్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.
News September 13, 2025
కరీంనగర్: LMD రిజర్వాయర్లో వెరైటీ చేప..!

KNR జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన మత్స్యకారుడు బోళ్ల భూమయ్య రోజూలాగే చేపలు పట్టేందుకు శనివారం ఉదయం ఎల్ఎండీ రిజర్వాయర్కి వెళ్లాడు. ఈ క్రమంలో వలలు తీస్తుండగా ఎర్రరంగులో ఉన్న వెరైటీ భారీ చేప అతడి కంటపడింది. కాగా, ఇలాంటి చేప ఇప్పటివరకు LMD రిజర్వాయర్లో లభించలేదని మత్స్యకారులు తెలిపారు. దీనిని ఉత్తర ప్రదేశ్కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.