News March 23, 2025
పరాయి పాలనపై పోరాటం.. నవ్వుతూనే ఉరికంబం!

భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురు.. ఈ మూడు పేర్లు వింటేనే భారతీయుడి ఒళ్లు పౌరుషంతో పులకరిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ఈ అమరులది మరచిపోలేని పాత్ర. 1928, డిసెంబరు 17న బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య, పార్లమెంటుపై బాంబుదాడి ఆరోపణలపై ముగ్గుర్నీ 1931, మార్చి 23న బ్రిటిషర్లు ఉరి తీశారు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా షహీద్ దివస్ను భారత్ ఏటా మార్చి 23న జరుపుకుంటోంది.
Similar News
News March 29, 2025
మయన్మార్లో మరోసారి భూకంపం

తీవ్ర భూప్రకంపనలతో ఉలిక్కిపడిన మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అంతకుముందు మయన్మార్, థాయిలాండ్లో 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News March 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 29, 2025
మార్చి 29: చరిత్రలో ఈరోజు

1932: కవి కొప్పరపు వేంకట సుబ్బరాయ మరణం
1950: నటుడు ప్రసాద్ బాబు జననం
1952: తెలుగు రచయిత కె.ఎన్.వై.పతంజలి జననం
1953: స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు మరణం
1982: నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు
2016: సినీ నిర్మాత కాకిత జయకృష్ణ మరణం