News March 23, 2025
అంతర్జాతీయ పోటీలకు నిజామాబాద్ విద్యార్థిని ఎంపిక

భారత అండర్-15 సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30 వరకు తైవాన్లో జరిగే సాఫ్ట్ బాల్ పోటీల్లో డిచ్పల్లి మండలం సుద్దులం గురుకుల పాఠశాలకు చెందిన గన్న హర్షిని పాల్గొననుంది. ఈ సందర్భంగా క్రీడాకారిణిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్, తిరుపతి పాల్గొన్నారు.
Similar News
News December 30, 2025
వచ్చే ఏడాదీ రిపీట్ చేస్తారా?

కొత్త సంవత్సరం మొదలవుతుందంటే చాలు ఎక్కడ లేని రెజల్యూషన్స్ వస్తాయి. జిమ్కు వెళ్లడం, డైట్ మెయింటేన్ చేయడం, హెల్త్ను కాపాడుకోవడం, డబ్బులు సేవ్ చేసుకోవడం అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. 2025 ప్రారంభంలోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకొని ఉంటారు. వీటిలో ఎన్ని ఆచరణలో పెట్టారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? మారింది ఇయర్ మాత్రమేనా? మీ లైఫ్లో చోటు చేసుకున్న మార్పులు ఏంటి?
News December 30, 2025
కదిరిలో శ్రీవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఆర్డీవో శర్మ, ఈఓ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్కు ఘనస్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
News December 30, 2025
డేంజర్లో హైదరాబాద్

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ మంగళవారం తెల్లవారుజామున 285కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్లో ఈసమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT


