News March 23, 2025
గాంధేయవాది పసల కృష్ణభారతి మృతి

తాడేపల్లిగూడేనికి చెందిన గాంధేయవాది పసల కృష్ణభారతి (92) కన్నుమూశారు. హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని ప్లాట్లో ఆమె మృతి చెందారు. 2022 జులైలో భీమవరం వచ్చినప్పుడు ప్రధాని ఆమె కాళ్లకు నమస్కరించారు. తాడేపల్లిగూడేనికి చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మీ దంపతులకు కుమార్తె. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కృష్ణమూర్తి దంపతులు కీలక పాత్ర షోషించారు. ఆ సమయంలో అంజలక్ష్మీ తంజావూరు జైలులో కృష్ణభారతికి జన్మనిచ్చింది.
Similar News
News September 18, 2025
ఆసిఫాబాద్: ‘పోషణ మాసం కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలి’

పోషణ మాసం రోజువారీ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం ASF జిల్లా కలెక్టరేట్ మందిరంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ నిర్వహణపై సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య,గిరిజన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 8వ రాష్ట్రీయ పోషణ మాసం అక్టోబర్ 16వ తేదీ వరకు రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.
News September 18, 2025
ఖమ్మం పార్కు, ఖిల్లా రోప్వే అభివృద్ధికి ₹18 కోట్లు

ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్కు, ఖిల్లా రోప్వే అభివృద్ధికి ప్రభుత్వం ₹18 కోట్లు మంజూరు చేసింది. పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి ఈ మేరకు జీఓ నెం.51ని విడుదల చేశారు. వెలుగుమట్ల పార్కు అభివృద్ధి, నిర్వహణకు ₹3 కోట్లు, ఖిల్లా రోప్వే, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ₹15 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
News September 18, 2025
స్వచ్ఛతా హీ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టబోయే స్వచ్ఛతా హీ సేవా 2025 వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించారు. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో జిల్లా ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామ పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.