News March 23, 2025

అల్లూరి జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..

image

అల్లూరి రాజవొమ్మంగి పరిసర గ్రామాల్లో ఆదివారం స్కిన్‌లెస్ బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 260కి, స్కిన్‌తో రూ. 240కి విక్రయించారు. గత వారం కంటే కిలో కి రూ. 20 పెరిగిందని వ్యాపారులు తెలిపారు. పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, చింతూరు ఏరియాల్లో దాదాపు ఇదే రేటు పలికింది. వచ్చే రోజుల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఆదివారం 10 టన్నుల వరకు చికెన్ అమ్ముడు అవుతుందని తెలిపారు.

Similar News

News September 13, 2025

సుశీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన <<17691512>>సుశీల<<>> కర్కీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.

News September 13, 2025

GWL: కేటీఆర్ సభకు గద్వాల ఎమ్మెల్యే హాజరవుతారా?

image

గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు గద్వాలలో జరిగే కేటీఆర్ బహిరంగ సభకు ఆయన హాజరవుతారా లేదా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది.

News September 13, 2025

అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు

image

అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగించారు. రాయచోటి 1, మదనపల్లె 1, పీలేరు 1 చొప్పున బార్లకు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత సమయానికి ముందుగా అబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. లాటరీ పద్ధతిలో కేటాయింపు 18వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ PGRS హాల్లో నిర్వహిస్తామని తెలిపారు.