News March 23, 2025
పెంచికల్పేట్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: MLC

మారుమూల గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని MLC దండే విఠల్ పేర్కొన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్లకు ఆదివారం ఎమ్మెల్సీ దండే విఠల్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, దారుగపల్లి, చేడువాయి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News March 26, 2025
వరంగల్: అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరాకు టెండర్

వరంగల్ జిల్లాలోని 670 అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి తెలిపారు. నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలకు 2025 ఏప్రిల్ నుంచి మార్చి 2026 సంవత్సరం వరకు సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈనెల 28లోగా దరఖాస్తులు అందచేయాలని మరిన్ని వివరాల కోసం జిల్లా సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News March 26, 2025
గద్వాల: కోర్టు సముదాయానికి రూ.81కోట్లు మంజూరు

గద్వాల జిల్లాకు కొత్త సమీకృత కోర్టు సముదాయ భవనం మంజూరైందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న న్యాయస్థానం నిర్మాణనికి రూ.81 కోట్ల నిధులు విడుదల అయినట్లు అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
News March 26, 2025
వరంగల్: బస్టాండ్ నిర్మాణ పనుల్లో బాంబుల వినియోగం

వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల్లో ఆనధారితంగా బస్టాండ్ నిర్మాణం పనుల్లో బాంబులు ఉపయోగిస్తున్నారని ప్రజలు తెలిపారు. పునాది పనుల్లో బాంబు పేలడంతో భూపాలపల్లి డిపో బస్సు అద్దాలు పగిలినట్లు ప్రజలు తెలిపారు. ప్రయాణికులు తప్పిన పెనుముప్పు. పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.