News March 23, 2025

అనకాపల్లి జిల్లాలో లారీ బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

image

మాడుగుల మండలం గాదిరాయిలో ఓ ట్రాలీ లారీ ఆదివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. గాదిరాయి వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి 3 బైకులను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైకులపై వెళ్తున్న ఐదుగురు తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ నారాయణరావు చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News January 16, 2026

TODAY HEADLINES

image

⭒ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
⭒ మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN
⭒ దేశ భద్రత విషయంలో TG ముందుంటుంది.. ఆర్మీ అధికారులతో CM రేవంత్
⭒ రాయలసీమ లిఫ్ట్‌ను KCRకు జగన్ తాకట్టు పెట్టారు: సోమిరెడ్డి
⭒ TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌కు స్పీకర్ క్లీన్ చిట్
⭒ BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
⭒ U19 WC: USAపై IND గెలుపు

News January 16, 2026

మంచిర్యాల: పండగ పూట విషాదం

image

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నూరు మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానిక పెట్రోల్ బంక్ ఏరియా శనగకుంట ప్రాంత సమీపంలో రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 16, 2026

సారంగాపూర్: ఉరివేసుకొని యువకుడి మృతి

image

సారంగాపూర్ గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ(26) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మహమ్మద్ రఫీ తాగుడుకు బానిసై మద్యం మత్తులో బుధవారం ఇంటిలో దూలానికి ఉరివేసుకుని మృతి చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి షేక్ బిస్మిల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.