News March 23, 2025

హిందూపురంలో 8మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

image

హిందూపురం పరిధిలోని కొట్టిపి, కేంచినపల్లి సమీపంలోని హంద్రీనీవా పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడి చేసినట్లు తెలిపారు. ఇందులో 8 మందిని అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.30 వేలు నగదు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హిందూపురం పరిధిలో జూదం ఆడినా.. నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Similar News

News March 26, 2025

ఓటీటీలో అదరగొడుతున్న ‘గేమ్ ఛేంజర్’

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రూ.450కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 7న జీ5లో హిందీ వెర్షన్ విడుదలైంది. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్-10లో దూసుకెళ్తున్నట్లు జీ5 తెలిపింది. 250మిలియన్ మినిట్స్‌కు పైగా వ్యూస్ సాధించినట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

News March 26, 2025

ADB: వ్యక్తి హత్య.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు బుధవారం తీర్పునిచ్చారు. 2022, ఆగస్టు 21న జైనథ్ మండలం రాంపూర్‌కు చెందిన కొడిమెల ప్రభాకర్ పాత కక్షల కారణంగా కుట్ల రమేశ్‌ను కత్తితో పొడిచి చంపాడు. అప్పటి జైనథ్ ఎస్ఐ పెర్సిస్, సీఐ నరేశ్ కుమార్ కేసు నమోదు చేశారు. 18 మంది కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా విచారణలో నేరం రుజువైంది.

News March 26, 2025

కమలం + రెండు ఆకులు = ఆపరేషన్ TN

image

తమిళనాడులో కొత్త పొత్తు పొడిచేలా ఉంది. AIADMK మళ్లీ NDAలో చేరేలా కనిపిస్తోంది. 2026 TN ఎన్నికల్లో DMKను ఓడించేందుకు కమలం, రెండు ఆకులు కలిసి బరిలోకి దిగొచ్చని విశ్లేషకుల అంచనా. నిన్న ఢిల్లీలో అమిత్‌షాతో పళనిస్వామి (EPS) సహా కీలక నేతలు 2hrs సుదీర్ఘంగా చర్చించారు. అక్కడ సమావేశం అవుతుండగానే DMKను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామని ఇక్కడ అన్నామలై అన్నారు. TN చేరుకున్న EPS సైతం అదే డైలాగ్ వినిపించారు.

error: Content is protected !!