News March 23, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్లో 219 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
Similar News
News March 26, 2025
పత్తికొండ వాసి రామ్మోహన్కు సేవా పురస్కారం

పత్తికొండకు చెందిన కేపీఆర్ మైత్రి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్మోహన్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. తన సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పాండిచ్చేరిలో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ అచీవర్స్ అవార్డు-2025 ప్రధానోత్సవంలో డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.
News March 25, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

➤ కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు
➤ బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ
➤ నవోదయ ఫలితాల్లో ఆస్పరిలో బార్బర్ కొడుకు ప్రతిభ
➤ ఆలూరు: వంట గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ వ్యక్తి మృతి
➤ శ్రీశైలం మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం
➤ సీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్
➤ నందవరంలో వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్
➤ ఎమ్మిగనూరులో 27న జాబ్ మేళా
➤కోసిగిలో గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
News March 25, 2025
బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు SP

ఐపీఎల్ వేళ యువత బెట్టింగ్కు దూరంగా ఉండాలని కర్నూలు SP విక్రాంత్ పాటిల్ సూచించారు. ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమనే మాయలో పడకండి. అమాయక ప్రజలను మోసగించేందుకు ముఠాలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్తో కొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే 100/112కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని ఎస్పీ తెలిపారు.