News March 23, 2025
కాంగ్రెస్ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు: KTR

TG: ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా CM రేవంత్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండేదని రైతులు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై అసూయ, ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే అని ఆరోపించారు.
Similar News
News March 26, 2025
మల్లెలతీర్థం వల్లే SLBC ప్రమాదం!

TG: SLBC టన్నెల్ ప్రమాదానికి మల్లెలతీర్థం జలపాతమే కారణమని నిపుణులు అనుమానిస్తున్నారు. ఆ జలపాతం నీరే ఊటనీరుగా మారి సొరంగం పైకప్పును కూల్చేసినట్లు గుర్తించారు. దేవాదుల ప్రాజెక్టును చలివాగు ముంచేసినట్లుగానే ఈ ప్రాజెక్టును మల్లెలతీర్థం ముంచేసింది. టన్నెల్లోకి నిమిషానికి 3 వేల లీటర్ల ఊట రావడానికి కారణం ఇదే. ఇక్కడికి వచ్చే సీఫేజీ శ్రీశైలం రిజర్వాయర్ది కాదని వాటర్ఫాల్ నుంచి వస్తోందని నిర్ధారించారు.
News March 26, 2025
వరల్డ్ పర్పుల్ డే!

ఈరోజు ‘వరల్డ్ పర్పుల్ డే’. దీన్ని మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం అని కూడా పిలుస్తుంటారు. మూర్ఛ గురించి అవగాహన పెంచడానికి, ఆ వ్యాధి గురించి ప్రజల్లో ఉన్న అపోహలు& భయాలను తొలగించడానికి ప్రతి ఏటా మార్చి 26న ఈ డేని నిర్వహిస్తారు. WHO ప్రకారం 50 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీని బారిన పడిన కెనడాకు చెందిన కాసెడీ మేగాన్ 2008లో ‘పర్పుల్ డే’ను తీసుకొచ్చారు.
News March 26, 2025
రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్

IPLలో శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. రెండు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్గా ఆడిన తొలి మ్యాచులోనే 90+ స్కోర్ చేసిన క్రికెటర్గా నిలిచారు. 2018లో DC తరఫున KKRపై 93, నిన్నటి మ్యాచులో GTపై 97 రన్స్ చేశారు. అతను సెంచరీని త్యాగం చేసి శశాంక్ సింగ్ను షాట్స్ ఆడమని చెప్పడం వల్ల చివరి ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. ఆ పరుగులే మ్యాచ్ చివర్లో కీలకంగా మారాయి. ఫలితంగా 11 రన్స్ తేడాతో PBKS విన్ అయింది.