News March 24, 2025
బాసరలో ఆర్జీయూకేటీలో అంతఃప్రజ్ఞ టెక్ ఫెస్ట్

బాసర RGUKTలో అంతఃప్రజ్ఞ టెక్ ఫస్ట్-యువ ఉత్సవ్2025 నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్&స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని వీసీ గోవర్ధన్, ADB జిల్లా యూత్ ఆఫీసర్ సుశీల్ భడ్ ప్రారంభించారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం పట్ల ప్రశంసలను పెంపొందించడం ఆర్జీయూకేటీ లక్ష్యమని వీసీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో భారత్ నెంబర్1గా ఉండాలన్నారు.
Similar News
News January 13, 2026
జగిత్యాల: చలో ఖమ్మం సీపీఐ శతాబ్ది సభకు పిలుపు

ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ వంద ఏళ్ల వేడుకల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ జగిత్యాలలో మంగళవారం గోడపత్రికను ఆవిష్కరించారు. పట్టణ కార్యదర్శి మాడిశెట్టి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో పార్టీ ప్రస్థానాన్ని చాటేలా ఈ భారీ సభ సాగుతుందని తెలిపారు. ఈ చారిత్రాత్మక సభకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
News January 13, 2026
సూర్యాపేట: ఎన్నికల సామగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జరగనున్న రెండో సాధారణ ఎన్నికల కోసం సామగ్రి సరఫరా చేసేందుకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కె.సీతారామరావు తెలిపారు. ఆసక్తిగల సంస్థలు ఈనెల 17న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 9885627131 నంబరును సంప్రదించాలని సూచించారు.
News January 13, 2026
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల

TG: సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్లు, వార్డు మెంబర్లకు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.


