News March 24, 2025

బాసరలో ఆర్జీయూకేటీలో అంతఃప్రజ్ఞ టెక్ ఫెస్ట్

image

బాసర RGUKTలో అంతఃప్రజ్ఞ టెక్ ఫస్ట్-యువ ఉత్సవ్2025 నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్&స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని వీసీ గోవర్ధన్, ADB జిల్లా యూత్ ఆఫీసర్ సుశీల్ భడ్ ప్రారంభించారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం పట్ల ప్రశంసలను పెంపొందించడం ఆర్జీయూకేటీ లక్ష్యమని వీసీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో భారత్ నెంబర్1గా ఉండాలన్నారు.

Similar News

News November 3, 2025

బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

image

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

News November 3, 2025

ASF: అనధికారంగా వైన్స్ వేలం..!

image

ఆసిఫాబాద్ జిల్లాలో 5 రోజుల క్రితం మద్యం దుకాణాల టెండర్లు పూర్తయ్యాయి. దుకాణాలు పొందిన వారికి అదృష్టం వరించిందని అందరు అనుకున్నారు. అయితే నిజమే వారికి అదృష్టం వరించింది. అధికారిక టెండర్లు పూర్తవ్వగానే ఇప్పడు అనధికారంగా వేలం పాటలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న వారు ఆ దుకాణాలను రూ.కోట్లలో విక్రయించడానికి చూస్తున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

News November 3, 2025

ములుగు: అర్ధరాత్రి భుజాలపై పిల్లలతో వాగు దాటారు!

image

ములుగు(D) ఏటూరునాగారం(M) కొండాయిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాధరి శేఖర్ దంపతుల ఆరేళ్ల పాపకు తీవ్ర జ్వరం వచ్చింది. తల్లడిల్లిన తల్లిదండ్రులు దొడ్ల-మల్యాల మధ్య జంపన్నవాగులో అర్ధరాత్రి ఒంటిగంటకు తమ ఇద్దరు పిల్లలను భుజాలపై ఎత్తుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుదాటారు. ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంతో అర్ధరాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం.