News March 25, 2024

ఎవరీ వినోద్ రావు?

image

TS: ఖమ్మం బీజేపీ ఎంపీ టికెట్ జలగం వెంకట్రావుకు దక్కుతుందని భావించినా.. అనూహ్యంగా తాండ్ర వినోద్ రావుకు అదృష్టం వరించింది. వినోద్ స్వస్థలం భద్రాద్రి జిల్లా ములకలపల్లి మం. తిమ్మంపేట. ఈయన తాత సుదర్శన్ రావు భద్రాచలం రామాలయం ట్రస్టీగా ఉండేవారు. వినోద్ 20 ఏళ్లుగా HYDలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈటల సన్నిహితుడైన ఈయన.. గత నెలలోనే బీజేపీలో చేరారు. ఈటల అండతోనే టికెట్ దక్కినట్లు సమాచారం.

Similar News

News November 13, 2025

రేపే ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ రాబోతోంది. మీరెంతో అభిమానించే Way2News ఉ.8 గంటల నుంచే కౌంటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతుంది. వేగంతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్లతో ఫలితాల వివరాలను వెల్లడిస్తుంది.

News November 13, 2025

TG TET షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News November 13, 2025

పచ్చిరొట్టగా పెసర/మినుముతో సాగుకు లాభం

image

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.