News March 24, 2025

యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

image

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఆదాయ వివరాలను ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా వీటి ద్వారా రూ.1,03,200, ప్రసాద విక్రయాలు రూ.19,04,650, VIP దర్శనాలు రూ.8,10,000, బ్రేక్ దర్శనాలు రూ.3,78,900, కార్ పార్కింగ్ రూ.7,04,500, యాదరుషి నిలయం రూ.1,92,054, ప్రధాన బుకింగ్ రూ.2,55,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,28,666 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News November 4, 2025

రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్‌లో క్యూలైన్ల తొలగింపు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలోని ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో ఉన్న క్యూలైన్లను ఆలయ అధికారులు తొలగిస్తున్నారు. ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో కోడె మొక్కుల కోసం జిగ్ జాగ్ వరుసలతో కూడిన పెద్ద క్యూ లైన్ ఉంది. దీంతోపాటు ప్రసాదాల కోసం, పూజా టికెట్ల విక్రయం కోసం ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా ఓపెన్ స్లాబ్ మొత్తం కూల్చివేయనున్నారు. దీంతో మొత్తం క్యూలైన్లను తొలగిస్తున్నారు.

News November 4, 2025

కొండారెడ్డిపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

NGKL జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 36.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కల్వకుర్తి 31.0, కిష్టంపల్లి 22.5, ఎల్లికల్, లింగాల 20.5, ఉప్పునుంతల 18.3, ఐనోల్ 17.0, కుమ్మెర 15.5, ఊర్కొండ 10.0, అమ్రాబాద్ 9.8, వెల్టూర్ 8.8, వటవర్లపల్లి 2.8, అచ్చంపేట 2.3, అత్యల్పంగా వంకేశ్వర్ లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

News November 4, 2025

వర్షంలో ఇబ్బంది పడుతున్న భక్తులు

image

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేములవాడకు వచ్చిన భక్తులు వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని, శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం వేకువజాము నుంచి వర్షం ప్రారంభం కావడంతో భక్తులు వర్షంలో తడుస్తూనే శ్రీ స్వామి వారి దర్శనం కోసం వెళ్తున్నారు.