News March 24, 2025
బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: DGP

AP: బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.
Similar News
News March 26, 2025
Stock Markets: మీడియా, హెల్త్కేర్ షేర్లు కుదేలు

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, రెసిస్టెన్సీ స్థాయి వద్ద అమ్మకాల సెగతో స్టాక్మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మిడ్ సెషన్లో నిఫ్టీ 23,604 (-65), సెన్సెక్స్ 77,696 (-320) వద్ద చలిస్తున్నాయి. మీడియా, హెల్త్కేర్, ఫార్మా, బ్యాంకు, ఫైనాన్స్, చమురు, ఐటీ, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఇండస్ఇండ్, ట్రెంట్, ఎం&ఎం, BEL, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. TECH M, NTPC, యాక్సిస్, సిప్లా టాప్ లూజర్స్.
News March 26, 2025
ముస్లిం కుటుంబాల మధ్య హిందువులు సేఫ్గా ఉండగలరా?: CM యోగి

తమ రాష్ట్రంలో అన్ని మతాలవారూ సేఫ్గానే ఉన్నారని UP CM యోగి అన్నారు. ‘హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలూ సురక్షితంగానే ఉంటారు. 100 హిందూ కుటుంబాల మధ్యలో ఓ ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉండగలదు. 100 ముస్లిం కుటుంబాల మధ్య 50మంది హిందువులు సేఫ్గా ఉండగలరా? బంగ్లా, పాక్ దేశాలే నిదర్శనం. అఫ్గాన్లో హిందువులు ఏమయ్యారు? అక్కడ జరిగిన తప్పు మన వద్ద జరగకూడదు’ అని స్పష్టం చేశారు.
News March 26, 2025
అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్తో దుమారం

TG: కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి KTR చేసిన కామెంట్స్ అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని Dy.CM భట్టి విక్రమార్క డిమాండ్ చేయడంతో సభ మరింత హీట్ ఎక్కింది. పరస్పర కామెంట్లతో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. KTR వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించడంతో BRS సభ్యులు వాకౌట్ చేశారు.