News March 24, 2025
ఈనెల 31లోగా దరఖాస్తులు: కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం కోరారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటీఐ, డిప్లమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమలో వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
Similar News
News March 29, 2025
ప.గో: సోషల్ పరీక్ష తేదీ మార్పు..డీఈవో

పశ్చిమగోదావరి జిల్లాలో మార్చి 31న జరగాల్సిన సోషల్ పరీక్షను ఏప్రిల్ 1కు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు డీఈవో నారాయణ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31 రంజాన్ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం జరగవలసిన సోషల్ పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీకి మార్చినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు
News March 28, 2025
ప.గో: AMC ఛైర్మన్లు ఎవరంటే..?

ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా పలువురికి అవకాశం దక్కింది.
☞ తణుకు: కొండే శివ (టీడీపీ)
☞ తాడేపల్లిగూడెం: మంగాబాయి (జనసేన, పైఫొటో)
☞ ఉంగుటూరు: కరేటి జ్యోతి(జనసేన)
☞దెందులూరు: గారపాటి రామసీత(టీడీపీ)
☞ ఏలూరు: మామిళ్లపల్లి పార్థసారథి (టీడీపీ)
News March 28, 2025
అత్తిలిలో కూటమి నేతల ఆందోళన అందుకేనా?

అత్తిలి ఎంపీపీ తీవ్ర ఉత్కంఠను రేపుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నిక సమావేశానికి హాజరు కాకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను వైసీపీ నేతలు నిర్బంధించారని.. వారి కోసమే తమ ఆందోళన అని కూటమి శ్రేణులు అంటున్నాయి.