News March 24, 2025

డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

image

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.

Similar News

News March 26, 2025

ఆదోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్

image

ఆదోని అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎలక్షన్‌కు రంగం సిద్ధం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్స్‌గా విజయ భాస్కర్ రెడ్డి, సోమశేఖర్, హనుమేశ్‌ను ఎన్నుకున్నారు. న్యాయవాదుల మధ్య రెండు ప్యానల్స్ నుంచి నామినేషన్ వేశారని, ప్రెసిడెంట్‌గా శ్రీరాములు, మధుసూదన్ రెడ్డి మధ్య.. వైస్ ప్రెసిడెంట్‌గా జే.వెంకటేశ్వర్లు, లోకేశ్ కుమార్ మధ్య పోటీ ఉండగా.. మరి కొంతమంది నామినేషన్ దాఖలు చేశారని ఎలక్షన్ ఆఫీసర్లు తెలిపారు.

News March 26, 2025

అడుగుకు ‘రూపాయి పావలా’ కమీషన్ వసూలు: YCP

image

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్‌ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.

News March 26, 2025

శ్రీశైలానికి కన్నడిగుల సాహస యాత్ర

image

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది కన్నడిగులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి వస్తూ ఆత్మకూరు సమీపంలో కాళ్లకు కర్రలు కట్టుకొని దట్టమైన నల్లమల అడవులలో సాహస యాత్రను చేపడుతున్నారు. వారి పాదయాత్రను చూసి స్థానిక ప్రజలు కన్నడిగుల భక్తికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.

error: Content is protected !!