News March 24, 2025

MBNR: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో గద్వాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. గద్వాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 8, 2026

విశాఖ: భవనం పైనుంచి పడి బాలిక మృతి

image

మల్కాపురం పీఎస్ పరిధిలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి బాలిక మృతి చెందింది. జనతా కాలనీలో నివసిస్తున్న కనకరాజు కుమార్తె అమృత ఈ నెల 4న రెండో రెండో అంతస్తులో నిలబడి పక్కింటి వారితో మాట్లాడుతుండగా కింద నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి ఆమె భవనం పైనుంచి తొంగి చూసింది. ఈ క్రమంలో పట్టు తప్పి బాలిక భవనంపై నుంచి కిందకు తూగి పడిపోయింది. తలకు గాయం అవడంతో కేజీహెచ్‌కు తరలించగా బుధవారం బాలిక మృతి చెందింది.

News January 8, 2026

అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

image

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.

News January 8, 2026

VZM: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

image

భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో సుందరపేట సీహెచ్‌సీకి, డ్రైవర్‌ను కేంద్రాసుపత్రికి తరలించారు.