News March 24, 2025

పాలకుర్తి: జాగృతి పోలీస్ కళా బృందం అవగాహన

image

పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామంలో జాగృతి పోలీస్ కళా బృందం వారు పలు అంశాలపై గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదివారం ఈ సందర్భంగా చదువు, రోడ్డు ప్రమాదాలు, డయల్ 100, ఈవ్ టీజింగ్, సీసీ కెమెరాలు, షీ టీం, గుట్కా, గంజాయి, డ్రగ్స్ వాటి లాభ నష్టాల గురించి ఆటపాట రూపంలో వివరించారు. ఎస్ఐ లింగారెడ్డి, సంపత్, రాజ్ కుమార్, సూర్య, ప్రకాష్, రవి, మారయ్య తదితరులున్నారు.

Similar News

News November 10, 2025

యాదాద్రి: మధ్యాహ్న భోజనం తనిఖీ చేయనున్న అధికారులు

image

ఈనెల 11, 13న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎంపిక చేసిన అధికారులచే మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను, మూత్రశాలలను పర్యవేక్షించాలని సూచించారు. పర్యవేక్షించిన అంశాలను చెక్ లిస్ట్ రూపంలో నమోదు చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు.

News November 10, 2025

శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యితో రూ. 251 కోట్ల దోపిడి: పట్టాభి

image

ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని TDP నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. YCP హయాంలో TTD ఛైర్మన్‌లుగా పనిచేసిన జగన్ బంధువులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. YV సుబ్బారెడ్డి హయాంలో ‘భోలే బాబా’ కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ. 251 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అంతేకాకుండా పామాయిల్ పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్నారు.

News November 10, 2025

VKB: ధాన్యం సరైన విధంగా కొనుగోలు చేయాలి: కలెక్టర్

image

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం పత్తి కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.