News March 24, 2025
నల్గొండ: లాడ్జిలో వ్యక్తి మృతదేహం లభ్యం

నల్గొండ పట్టణంలోని రూపా లాడ్జిలో గుర్తుతెలియని వ్యక్తి(35) డెడ్ బాడీని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతడు విజయవాడ ఫైర్ వర్క్స్లో పనిచేస్తున్నట్లు లాడ్జి రికార్డ్స్లో ఉందని నల్గొండ టూ టౌన్ పీఎస్ SI సైదులు తెలిపారు. మృతుడిని నవీన్గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 70176 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News March 29, 2025
యూట్యూబర్ శంకర్పై కేసు నమోదు

HYD అంబర్పేట పీఎస్లో యూట్యూబర్ శంకర్పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా, శంకర్ది నల్గొండ జిల్లా.
News March 29, 2025
నల్గొండ: ముగ్గురు పిల్లలు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే.<<>> RR జిల్లా తలకొండపల్లికి చెందిన చెన్నయ్య 2012లో నల్గొండ జిల్లా మందాపూర్ వాసి రజితను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం పొద్దున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్గా ఉందని ఆస్పత్రికి తరలించారు.
News March 29, 2025
రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన

రంజాన్ పండుగ సందర్భంగా నల్లగొండలోని ఈద్గా వద్ద డీఎస్పీ శివరామిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈద్గా కమిటీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో ఎండ వేడిమి, దృశ్య తాగునీరు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారుఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, ఈద్గా సెక్రటరీ ఫుర్ఖాన్ పాల్గొన్నారు.