News March 24, 2025
అమరావతిలో 250 ఎకరాల్లో ప్రధాని సభ!

AP: రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేసేందుకు PM మోదీ వచ్చే నెల 15-20 తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖరారైనా పీఎంవో తేదీని ఫిక్స్ చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వం బహిరంగ సభ కోసం 250 ఎకరాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక ఎన్-9 రోడ్డు సమీపాన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 30న ఇక్కడే ఉగాది ఉత్సవాలు నిర్వహించనుంది.
Similar News
News March 29, 2025
‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి భారీగా దరఖాస్తులు

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా, ఏప్రిల్ 6 నుంచి 30 వరకు అప్లికేషన్లను పరిశీలించనున్నారు. జూన్ 2న మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తారు.
News March 29, 2025
ఈ విక్టరీ చాలా స్పెషల్ గురూ!

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో CSKపై RCB దాదాపు 17 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ గ్రౌండ్లో చివరిసారిగా 2008లో చెన్నైను ఓడించిన బెంగళూరు.. మళ్లీ 6,155 రోజుల తర్వాత ఇప్పుడు గెలుపును నమోదు చేసింది. అందుకే ఈ విజయం RCBకి చాలా స్పెషల్. ఈ సీజన్లో పాటీదార్ సేనకు ఇది రెండో విజయం. 4 పాయింట్లతో ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉంది. ఈ ఫామ్ను ఇలాగే కొనసాగించి ఛాంపియన్గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News March 29, 2025
మా ఓటమికి అదే కారణం: రుతురాజ్

RCBతో మ్యాచులో తాము ఓడిపోవడానికి ఫీల్డింగ్ సరిగా చేయకపోవడమే కారణమని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు. ‘ఈ పిచ్పై 170 మంచి స్కోర్. RCB 20 రన్స్ అదనంగా చేసింది. మా ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచులు వదిలేశారు. పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు కొంచెం భిన్నంగా బ్యాటింగ్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే వికెట్లు కోల్పోయాం. కేవలం 50 రన్స్ తేడాతో ఓడాం. భారీ తేడాతో ఓడనందుకు సంతోషం’ అని పేర్కొన్నారు.