News March 24, 2025
31 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని
31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,198 మంది దర్శించుకోగా, 25,665 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Similar News
News January 3, 2026
ఆస్ట్రోనాట్స్కు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తీసేస్తారు

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తొలగిస్తారట. సాధారణంగా వీటితో సమస్యలుండవు. కానీ ఇబ్బంది వస్తే త్వరగా తొలగించాలి. అందుకే.. అంతరిక్షంలో ఉండగా వీటి సమస్య వస్తే కష్టమని ముందే ఆపరేషన్ చేస్తారట. ఇటీవలే స్పేస్లోకి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లా ఈ విషయం వెల్లడించారు. సెల్ఫ్ ట్రీట్మెంట్పై ట్రైనింగ్ ఇస్తారని, ఆపరేషన్లు లాంటివి మాత్రం అక్కడి జీరో గ్రావిటీలో చేసుకోలేమన్నారు.
News January 3, 2026
నల్లమల సాగర్కు రేవంత్ పరోక్ష అంగీకారం: హరీశ్రావు

నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లకు కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిపి <<18742119>>కమిటీ<<>> ఖరారు చేసినట్లు మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు. ‘3నెలల్లో నీటి పంపకాలు పూర్తి చేయడమంటే 3 నెలల్లో నల్లమల సాగర్ను ఆమోదించడమే. ఇందుకు AP పెట్టిన టెండర్ గడువు తీరాకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అంటే రేవంత్ సర్కార్ ఆ ప్రాజెక్టును పరోక్షంగా అంగీకరిస్తోందని అర్థమవుతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
కూనంనేని క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్

TG: PM మోదీకి <<18744541>>MLA కూనంనేని<<>> సాంబశివరావు క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘దేశంలో కమ్యూనిజం కనుమరుగవడానికి ఇలాంటి భాషే కారణమనిపిస్తోంది. అసెంబ్లీలో అలాంటి భాషకు స్థానంలేదు. ప్రభుత్వం, స్పీకర్ ఖండించకుండా మర్యాదని మరిచి వారి మిత్రపక్షాన్ని సమర్థించారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుంటే.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ రాజకీయాలు దుర్భాషల దగ్గరే ఆగిపోయాయి’ అని ట్వీట్ చేశారు.


