News March 24, 2025

అచ్చంపేట POLITICAL.. ‘ఫైర్ బ్రాండ్ జోష్ పెంచాలి’

image

పాలమూరు రాజకీయాల్లో అచ్చంపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014, 2018లో వరుసగా BRS నుంచి గెలిచిన గువ్వల బాలరాజు 2023లో ఓడిపోయారు. ప్రత్యర్థుల మాటలకు దీటుగా కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న గువ్వల బాలరాజు ఇటీవల కొంత సైలెంట్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ గువ్వల బాలరాజు మరింత జోష్ పెంచాలని శ్రేణులు భావిస్తున్నాయి. మీ కామెంట్..?

Similar News

News March 29, 2025

వికారాబాద్: అగ్నివీర్‌కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

image

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామానికి చెందిన అరవింద్, మంబాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమారులు అగ్నివీర్ కు ఎంపికయ్యారు. మండలం నుంచి ఈ ఏడాది ఇద్దరు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే కావడం గమనార్హం.

News March 29, 2025

అమలాపురం: ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచనలు

image

ఈ ఏడాది రికార్డు స్థాయిలో వడగాల్పులు ఉంటాయన్న వాతవరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రజలకు సూచించారు. వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శుక్రవారం సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జనసంచారం, భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.

News March 29, 2025

MBNR: ‘కవులకు పుట్టినిల్లు.. పాలమూరు’

image

పాలమూరు జిల్లా కవులకు పుట్టినిల్లని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఓ కవి సమ్మేళనంలో.. తెలంగాణలో కవులే లేరని ఆంధ్ర కవి అనగా.. సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులతో గోలకొండ కవుల సంచిక గ్రంథాన్ని రాసి చరిత్ర సృష్టించారన్నారు. ముకురాల రామారెడ్డి, రుక్ముద్దీన్, రాళ్లపల్లి అనంత శర్మ, పాకాల యశోదా రెడ్డి, కపిలవాయి లింగమూర్తి కవులు పాలమూరు ఖ్యాతిని పెంచారన్నారు.

error: Content is protected !!