News March 24, 2025

విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

image

ఈనెల 27న విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రూ.75లక్షల నిధులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని మైనారిటీ నేతలు అందరూ పాల్గొననున్నారని చెప్పారు.

Similar News

News March 26, 2025

కృష్ణా: జిల్లాలో మోటార్లు దొంగతనం చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

image

కృష్ణాజిల్లాలోని వివిధ మండలాలలో మోటార్ల వద్ద విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను కంకిపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దుండగుల నుంచి 216 మోటార్లు, 7 ట్రాన్స్‌ఫార్మర్‌లకు సంబంధించి సుమారు రూ.4.50 లక్షల విలువైన, 2400 మీటర్ల పొడవు, 300 కేజీల బరువున్న రాగి వైర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.

News March 26, 2025

కొడాలి నానికి ఎటువంటి అనారోగ్య సమస్య లేదు: దుక్కిపాటి

image

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్‌తో హాస్పిటల్లో జాయిన్ అయినా కొడాలి నానికి అన్ని పరీక్షలు చేసి ఆరోగ్యం సవ్యంగా ఉన్నట్లు రిపోర్ట్‌లు వచ్చాయని చెప్పారు. ఆయనకు గుండెపోటు అని మీడియాలో వస్తున్న కథనాలు ఆవాస్తమని ఆయన ఖండించారు. 

News March 26, 2025

కృష్ణా: పొట్టిపాడు టోల్ గేట్ వద్ద గంజాయి పట్టివేత 

image

ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అనకాపల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్న కారును తనిఖీ చేయగా, 62 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో భాస్కర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 

error: Content is protected !!