News March 24, 2025
కాకినాడ: పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి

పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 27న ఉపసర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మండల ఈవోపీఆర్డీ ఆయా గ్రామ ఉపసర్పంచ్ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా విధులు నిర్వహిస్తారు. కాకినాడ జిల్లాలో పెదపాడు మండలం రామేశ్వరం, తుని పరిధిలో దొండవాక, సామర్లకోట మండలం బి.వేమవరం, తొండంగి మండలం పైడికొండ, ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి పంచాయతీల పరిధిలో ఉపసర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి.
Similar News
News November 12, 2025
HYD: డ్రగ్ కేసులో నైజీరియన్ డిపోర్టేషన్

హైదరాబాద్ H-NEW పోలీసులు డ్రగ్ కేసులో నైజీరియన్ ఒన్యేవుకూ కెలెచి విక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా భారత్లో ఉండి డ్రగ్ సరఫరాలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. FRRO సహకారంతో అతడిని డిపార్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నైజీరియన్స్ అనుమానాస్పదంగా కనబడితే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News November 12, 2025
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: MHBD కలెక్టర్

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఈమేరకు నెల్లికుదురు మండలకేంద్రం, రామన్నగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను వారు సందర్శించారు. అదేవిధంగా మండలంలోని కేజీబీవీ పాఠశాలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News November 12, 2025
ADB: KU పరీక్షల షెడ్యూల్ విడుదల

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్సైట్లో ఉన్నాయన్నారు.


