News March 24, 2025

ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

image

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News February 24, 2026

Trending: HYDలో అంతాక్షరీ 2.O!

image

చిన్నప్పుడు మనం ఫ్రీగా ఆడిన అంతాక్షరీ ఇప్పుడు ‘మ్యూజికల్ జామింగ్’ (Musical Jamming) పేరుతో కొత్త రూపం దాల్చింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ కేఫ్స్‌లో వారాంతాల్లో ఈ సెషన్స్ జరుగుతున్నాయి. దీనికోసం జెన్-జీ కుర్రాళ్లు ఒక్కొక్కరు రూ.499 నుంచి రూ.999 వరకు టికెట్ కొని మరీ వెళ్తున్నారు. పాత పాటలకే కొత్త ట్యూన్లు కట్టి, చప్పట్లు కొడుతూ పాడటమే ఈ ‘పెయిడ్ అంతాక్షరి’ స్పెషాలిటీ. పాత ఆటకి కార్పొరేట్ రేట్ పడింది.

News February 24, 2026

HYD: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ ఇక చరిత్రే!

image

రాజేంద్రనగర్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ ఇక చరిత్రే. 2012 నిబంధనల ప్రకారం 50 మీటర్ల బఫర్ జోన్‌లో ఉండటంతో గతంలో అనుమతులున్నా మార్కెట్ రేటు చెల్లించి స్వాధీనం చేసుకుంటామని RDO వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టారు. కిస్మత్‌పురా, దర్గా, ఉప్పర్‌పల్లిలో ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 60 రోజుల్లో అభిప్రాయాలు తీసుకొని పారదర్శకంగా ముందుకెళ్తామన్నారు. ఇక 500 మీటర్ల పరిధిలో ఇటుక పెట్టే ఛాన్సే లేదు.

News February 24, 2026

HYD: పర్యావరణం పేరుతో పాతాళానికి చెత్త!

image

జవహర్‌నగర్, దుండిగల్‌లో గుట్టుచప్పుడు కాకుండా 25 శాతం మిగులు వ్యర్థాలను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తెరవెనక పావులు కదులుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వేస్ట్-టు-ఎనర్జీ తర్వాత మిగిలే ప్రమాదకర బూడిదను ఎకో-పార్కుల ముసుగులో భూమిలో పాతిపెట్టేందుకు క్లియరెన్సుల వేట సాగుతోంది. పర్యావరణ అనుమతులు రావడం కష్టమే అయినా, పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.