News March 24, 2025

ఏలూరులో యువతిపై ముగ్గురు అత్యాచారం

image

ఏలూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. జేపీ నగర్‌కు చెందిన వంశీకృష్ణ ఓ యువతి(18)ని ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ వంశీకృష్ణ స్నేహితులు సాయిచరణ్, శివశంకర్ సైతం ఆమెపై అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మొత్తం ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News March 29, 2025

ప.గో: సోషల్ పరీక్ష తేదీ మార్పు..డీఈవో

image

పశ్చిమగోదావరి జిల్లాలో మార్చి 31న జరగాల్సిన సోషల్ పరీక్షను ఏప్రిల్ 1కు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు డీఈవో నారాయణ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31 రంజాన్ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం జరగవలసిన సోషల్ పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీకి మార్చినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు

News March 28, 2025

ప.గో: AMC ఛైర్మన్లు ఎవరంటే..?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా పలువురికి అవకాశం దక్కింది.
☞ తణుకు: కొండే శివ (టీడీపీ)
☞ తాడేపల్లిగూడెం: మంగాబాయి (జనసేన, పైఫొటో)
☞ ఉంగుటూరు: కరేటి జ్యోతి(జనసేన)
☞దెందులూరు: గారపాటి రామసీత(టీడీపీ)
☞ ఏలూరు: మామిళ్లపల్లి పార్థసారథి (టీడీపీ)

News March 28, 2025

అత్తిలిలో కూటమి నేతల ఆందోళన అందుకేనా?

image

అత్తిలి ఎంపీపీ తీవ్ర ఉత్కంఠను రేపుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నిక సమావేశానికి హాజరు కాకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను వైసీపీ నేతలు నిర్బంధించారని.. వారి కోసమే తమ ఆందోళన అని కూటమి శ్రేణులు అంటున్నాయి.

error: Content is protected !!