News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News March 28, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు!

@జిల్లాలోని నేటి 10వ తరగతి పరీక్షకు 7గురు గైర్హాజరు @ ధర్మపురి తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల నిరసన@ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం @ ధర్మపురి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ@ పెగడపల్లి గ్రామపంచాయతీని తనిఖీ చేసిన మండల పంచాయతీ అధికారి@ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్ర గర్భస్రావ సంరక్షణ శిక్షణ @ రాయికల్ లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు
News March 28, 2025
నిర్మాణ వ్యర్థాలపై కఠిన చర్యలు.. రూ.54 లక్షల పైగా పెనాల్టీలు

HYD నగరంలో నిర్మాణ, కూల్చివేత (C&D) వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేస్తున్న వారిపై టౌన్ ప్లానింగ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. గత నాలుగు నెలల్లో అధికారులు రూ.54,15,792 పెనాల్టీలు విధించారు. కేవలం కాప్రా సర్కిల్లోనే రూ.7,27,500 జరిమానా విధించారు. పట్టణ శుభ్రతకు భంగం కలిగించే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News March 28, 2025
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాక్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాకిచ్చింది. జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. కాగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. కోర్టు వివాదం నేపథ్యంలో తెలంగాణ పంపిన ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది.