News March 24, 2025
పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Similar News
News March 29, 2025
రేపు 126 మండలాల్లో వడగాలులు

AP: సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. రేపు 126, ఎల్లుండి 15 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది. అల్లూరి జిల్లా చింతూరులో అత్యధికంగా రేపు 43.7, ఎల్లుండి 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైన ఎండలు రికార్డవుతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటికెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం <
News March 29, 2025
‘వైస్రాయ్’ ఘటనపై వైసీపీ Ghiblistyle ఫొటోలు

వైస్రాయ్ హోటల్ ఘటన APలో అతిపెద్ద రాజకీయ ద్రోహాలలో ఒకటని YCP విమర్శించింది. TDP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ NTRకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన రోజును మరోసారి చూడండి అంటూ <<15920586>>Ghiblistyle<<>> ఫొటోలను షేర్ చేసింది. ‘చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి HYD వైస్రాయ్ హోటల్లో కుట్ర చేశారు. పార్టీని హైజాక్ చేసి NTRను అధికారం నుంచి తొలగించారు. ఈ బాధతోనే ఆయన 1996 జనవరిలో మరణించారు’ అని రాసుకొచ్చింది.
News March 29, 2025
సౌదీలో కనిపించిన చంద్రుడు.. ఇండియాలో ఎల్లుండి రంజాన్

సౌదీ అరేబియాలో చంద్రుడు దర్శనమిచ్చాడు. దీంతో ఆ దేశంలో రేపు (మార్చి 30) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు. ఉ.6.30 గంటలకు అక్కడి మసీద్ అల్ హరామ్లో ఈద్ ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 31న ఇండియాలో రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు.