News March 25, 2024

కూకట్‌పల్లిలో యువతిపై అత్యాచారం

image

ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన KPHBలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సంబంధించి KPHBలో ఆన్‌లైన్‌ శిక్షణకు చేరింది. ఈక్రమంలో ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు నరేందర్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం శిక్షణ సహచరుడు సంతోష్‌కు తెలపగా అతడు కూడా ఆమెను వేధించాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. నరేందర్, సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News September 9, 2025

మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

image

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.

News September 9, 2025

గ్రంథాలయాలను బలోపేతం చేయాలి: డా. రియాజ్

image

తెలంగాణలోని అన్ని స్థాయిల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ విజ్ఞప్తి చేశారు. “మరో గ్రంథాలయ ఉద్యమం, పుస్తకంతో నడక” అనే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు నడక ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వమే కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథాలయాలకు సరఫరా చేస్తే మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.

News September 9, 2025

HYD: మరో రెండు రోజులు పారిద్ధ్య పనులు

image

నెక్లెస్‌ రోడ్డుతో పాటు పీపుల్స్‌ప్లాజా, బేబిపాండ్, ఎన్టీఆర్‌ మార్గ్, సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం కారణంగా చెత్త పేరుకుపోయింది. నెక్లెస్‌ రోడ్డులో 100 మంది స్వీపర్లు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో 30 మంది స్వీపర్లు విధుల్లో పాల్గొంటున్నారు. చెత్త తొలగింపునకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు విగ్రహాల ఐరన్‌ రాడ్స్‌ను తొలగిస్తున్నారు.