News March 24, 2025
ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి: జగన్

AP: రైతుల విషయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, తమ ప్రభుత్వంలో పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదని మాజీ CM జగన్ అన్నారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కడప (D) లింగాలలో అరటి రైతులను <<15868939>>పరామర్శించిన<<>> ఆయన మాట్లాడుతూ.. ‘రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సొమ్ము ఇవ్వాలి. సాయం అందని వారిని మరో మూడేళ్లలో మేం అధికారంలోకి వచ్చి ఆదుకుంటాం’ అని తెలిపారు.
Similar News
News November 11, 2025
ఈ నెల 13 నుంచి అగ్రికల్చర్ కోర్సు అడ్మిషన్లకు కౌన్సెలింగ్

TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కాలేజీల్లో BSC ఆనర్స్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు HYD రాజేంద్రనగర్లోని యూనివర్సిటీలో కౌన్సెలింగ్కు హాజరు కావాలని అధికారులు సూచించారు. అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని చెప్పారు. సైట్: www.pjtau.edu.in/
News November 11, 2025
మహిళా ఐఏఎస్కు గృహ హింస వేధింపులు

సామాన్య మహిళలకే కాదు చట్టాలను రూపొందించే స్థానంలో ఉన్న ఉమెన్ బ్యూరోక్రాట్లకు గృహ హింస తప్పట్లేదు. IAS ఆఫీసర్ అయిన తనభర్త ఆశిష్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ IAS భారతి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్లో జరిగింది. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశిష్ సామాజిక న్యాయం విభాగంలో డైరెక్టర్ కాగా, భారతి ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.
News November 11, 2025
‘రాజాసాబ్’.. ప్రభాస్ సూపర్ లుక్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్గా కనిపిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.


