News March 24, 2025

నాగర్‌కర్నూల్: ‘సాగు నీరు లేక గొర్రెలకు వదిలేశా!’

image

సాగునీరు రాకపోవడంతో చేతికి వచ్చిన పంట ఎండిపోగా.. చేసేది ఏమీ లేక పంటను గొర్రెల మేతకు వదిలేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రాజాపూర్ గ్రామానికి చెందిన బొల్లెద్దుల లక్ష్మయ్య కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వ కింద రెండు ఎకరాల వరి పంటను వేశాడు. ఎకరాకు రూ.20 వేల చొప్పున రూ.40 వేలు ఖర్చు చేసి పంట సాగు చేశానని పది రోజులుగా నీరు అందడం లేదని వాపోయారు.

Similar News

News July 9, 2025

NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

image

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

News July 9, 2025

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందా?

image

AP: YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనకబడితే కొత్త మంత్రులు వస్తారని CM CBN ఇవాళ <<17007606>>వార్నింగ్<<>> ఇచ్చారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ మొదలైంది. నాగబాబుకు MLC పదవి దక్కిన తొలినాళ్లలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఉగాది తర్వాత ఆయన్ను క్యాబినెట్‌లోకి తీసుకుంటారని భావించినా అలా జరగలేదు. తాజాగా CM చేసిన వ్యాఖ్యలతో మంత్రి పదవి కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

News July 9, 2025

వరంగల్ నిట్‌లో తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం

image

వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌)లో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం నిర్వహించారు. బుధవారం నిట్ ఆడిటోరియంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఎంపవరింగ్ రీసెర్చ్ త్రూ షేర్డ్ సైన్టిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే థీమ్‌తో సమావేశం నిర్వహించారు. అన్ని రంగాలకు సాంకేతికతను అందించడమే ఐ స్టెమ్ లక్ష్యం అని వక్తలు పేర్కొన్నారు.