News March 25, 2024
కర్నూలు: పోక్సో కేసు నమోదు
కర్నూలుకు చెందిన లతీఫ్ అనే వ్యక్తిపై 2టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భార్యతో పాటు 8మంది ఆడ సంతానం కలిగిన ఇతను ఈనెల 1న 16 ఏళ్ల బాలికను నమ్మించి హైదరాబాద్కు తీసుకెళ్లి పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. దీంతో తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విషయం తెలిసి ఈనెల 21న బాలికను తిరిగి కర్నూలుకు తీసుకువచ్చాడు.
Similar News
News October 6, 2024
చిన్న చెరువులో మృతదేహం లభ్యం
అవుకు రిజర్వాయర్ సమీపంలోని చిన్న చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కూళ్లిపోయి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 6, 2024
రేపటి నుంచి యూనివర్సిటీలకు దసరా సెలవులు
కర్నూలు జిల్లాలోని యూనివర్సిటీలకు దసరా సెలవులు ప్రకటించారు. రాయలసీమ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలకు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ వీ.లోకనాథ తెలిపారు. 14వ తేదీ తిరిగి పునఃప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.
News October 6, 2024
రహదారులను వేగవంతంగా పూర్తి చేయండి: కలెక్టర్
నేషనల్ హైవే రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్హెచ్ 40 భూ సేకరణకు సంబంధించిన నష్ట పరిహారం వెంటనే పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్హెచ్ 340సీకి సంబంధించి బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు ఔటర్ రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు.