News March 24, 2025

మళ్లీ సొంతగూటికేనా!

image

కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్‌ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్‌లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.

Similar News

News March 29, 2025

ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్న అంజనప్ప

image

అనంతపురం జిల్లాకు చెందిన తేనే తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.అంజనప్ప శుక్రవారం ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. కనుమరుగవుతున్న కళా రూపాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో 221 కళాభిషేకం కార్యక్రమాలు పూర్తి చేసినందుకుగాను ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అవార్డు దక్కిందని తెలిపారు.

News March 29, 2025

గుంతకల్లు: రైల్లో ప్రయాణికుడి మృతి

image

గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(59) శుక్రవారం మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటికి చెందిన ఈయన.. ఈనెల రెండో తేదీన గోవా వెళ్లాడు. తిరిగి సొంతూరుకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని తాడిపత్రిలో రైల్వే ఎస్ఐ నాగప్ప, పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.

News March 29, 2025

రూ.18.17 లక్షల విలువ చేసే 10 డ్రోన్ కెమేరాలు వితరణ

image

కమ్యునిటీ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా స్వచ్చంధంగా ముందుకు వచ్చి రూ.18.17 లక్షల విలువ చేసే 10 డ్రోన్ కెమెరాలను అర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎస్పీ జగదీశ్‌కు అందజేశారు. తాడిపత్రికి చెందిన అర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని ఎస్పీ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. పోలీసు విధులకు టెక్నాలజీతో కూడిన డ్రోన్ల సేవలు తోడైతే జిల్లా ప్రశాంతంగా ఉంచేందుకు వీలుంటుందని అన్నారు.

error: Content is protected !!