News March 24, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల కేసులు నమోదైన సెలబ్రిటీలను సాక్షులుగా మార్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో 25 మంది సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 29, 2025
యూట్యూబ్ థంబ్నెయిల్స్పై ఫిల్మ్ ఛాంబర్ సీరియస్?

యూట్యూబ్లో తప్పుడు థంబ్నెయిల్స్ పెడుతున్న ఘటనలపై ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్కు చెందిన పలు సంఘాలతో ఛాంబర్ తాజాగా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వాటి స్వార్థం కోసం సినిమా వారిని లక్ష్యంగా చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ గురించి చర్చించినట్లు సమాచారం. అలాంటి యూట్యూబ్ ఛానల్స్పై వచ్చే నెల 1 నుంచి కఠిన చర్యల్ని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News March 29, 2025
బీటెక్ ఫెయిలైన వారికీ సర్టిఫికెట్

TG: నాలుగేళ్ల బీటెక్ కోర్సులో 50 శాతం సబ్జెక్టులు పాసైనా ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు ఓ కమిటీని నియమించనుంది. ప్రస్తుతం బీటెక్లో 160 క్రెడిట్లు(ఒక్కో సెమిస్టర్కు 20) ఉంటాయి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైనా పట్టా రాదు. కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే విద్యార్థులకు సర్టిఫికెట్ వస్తుంది. దీంతో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.
News March 29, 2025
డేటింగ్ యాప్లో ప్రేమ.. రూ.6.5 కోట్లు పోగొట్టుకున్నాడు

డేటింగ్ యాప్లో పరిచయమైన మహిళను నమ్మి ఓ వ్యక్తి ₹6.5Cr పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్సింగ్ ఓ సంస్థకు డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు కావడంతో ప్రేమ కోసం యాప్లో ప్రయత్నించగా అనిత పరిచయమైంది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులతో డబ్బు సంపాదించొచ్చని నమ్మించింది. తొలుత ₹3.2Lకు గంటల్లోనే ₹24K లాభం చూపింది. దీంతో ₹6.5Cr ఇన్వెస్ట్ చేయగా ముంచేయడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.