News March 24, 2025

రేవంత్ వల్లే శాంతిభద్రతలు పడిపోయాయి: హరీశ్ రావు

image

TG: ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటన యావత్ సమాజాన్ని కలిచివేసిందన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి సీఎం రేవంత్(హోంమంత్రి) చేతగాని పాలనే కారణమని మండిపడ్డారు.

Similar News

News November 6, 2025

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కెనరా <<>>బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన NISM/NCFM సర్టిఫికెట్ ఉండి పని అనుభవం గలవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/careers

News November 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 58

image

1. ధృతరాష్ట్రుడి రథసారథి ఎవరు?
2. కంసుడి తండ్రి ఎవరు?
3. శశాంకుడు అంటే ఎవరు?
4. విశ్వకర్మ పుత్రిక ఎవరు?
5. తెలుగు సంవత్సరాలు ఎన్ని?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 6, 2025

ఏపీలోని ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి: తుమ్మల

image

TG: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెంను తిరిగి విలీనం చేయాలని కోరారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం.