News March 24, 2025
పెందుర్తి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. విశాఖకు ఐరన్ ఓర్ తీసుకువచ్చిన ఈ రైలు తిరిగి వెళుతుండగా పట్టాలు తప్పి బోగీ చక్రాలు ఊడిపడ్డాయి. రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
అమ్రాబాద్: అక్కమహాదేవి గుహలకు మరో లాంచీ ఏర్పాటు

టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అక్కమహాదేవి గుహాల సందర్శనకు అధికారులు మరో లాంచీ ఏర్పాటు చేశారు. ఒకటే మినీ లాంచీ ఉండడంతో పర్యటకులు 3 గంటల వరకు వేచి ఉండేది. గమనించిన పర్యాటకశాఖ అధికారులు 30 మంది సామర్థ్యం గల మినీ లాంచీని దోమలపెంటకు తీసుకొచ్చారు. త్వరలోనే ప్రారంభిస్తామని పర్యాటక శాఖ జిల్లా అధికారి నరసింహ వెల్లడించారు.
News November 9, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారి 65పై చేర్యాల గేటు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణఖేడ్కు చెందిన బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News November 9, 2025
ములుగు: బాలుడి మృతిపై వైద్యశాఖ సీరియస్..!

ములుగు(D) కన్నాయిగూడెం(M) గూరేవులకు చెందిన హరినాథ్ స్వామి(7) అనే <<18238426>>బాలుడు పాముకాటుతో<<>> శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చిన బాలుడికి యాంటీడోస్ ఎందుకు ఇవ్వలేదనేదానిపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా లేకపోవడంపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.


