News March 24, 2025

పల్నాడు: లెక్కల పరీక్షకు 25, 212 మంది విద్యార్థుల హాజరు

image

పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 128 సెంటర్లలో 25,212 మంది విద్యార్థులు హాజరయ్యారు. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ.. 99.06శాతం ఉన్నట్లు తెలిపారు. 128 పరీక్షా కేంద్రాలను పరిశీలించేందుకు 22 సిట్టింగ్ స్క్వాడ్లు, 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వినుకొండ, నూజెండ్ల పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించడం జరిగిందని అన్నారు.

Similar News

News November 11, 2025

దేశంలో మహిళలే అసలైన మైనారిటీలు: SC

image

పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై SC కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తాజా డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు జయా ఠాకూర్ (CONG) దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్‌లు నాగరత్న, మహదేవన్‌ల బెంచి విచారించింది. ‘పౌరులందరికీ సమానత్వం ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. మహిళలు 48% ఉన్నా రాజకీయ సమానత్వంపై చర్చ నడుస్తోంది. అసలైన మైనారిటీలు వారే’ అని వ్యాఖ్యానించింది.

News November 11, 2025

పెద్దపల్లి: పత్తి గరిష్ఠ ధర రూ.6,762

image

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం పత్తికి గరిష్ఠంగా రూ.6,762(క్వింటాల్‌), కనిష్ఠంగా రూ.5,051, సగటు ధర రూ.6,762గా పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 475 మంది రైతులు మొత్తం 1647.90 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా, మార్కెట్‌ యార్డులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు సజావుగా సాగాయన్నారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

image

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.