News March 24, 2025
VZM: టెన్త్ పరీక్షలకు 22,786 మంది హాజరు

సోమవారం జిల్లా వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన టెన్త్ గణితం పరీక్షలకు 22,786 మంది విద్యార్థులు హాజరుకాగ 104 మంది గైర్హాజరు అయ్యారని విజయనగరం జిల్లా విద్యా శాఖాధికారి మాణిక్యం నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం విద్యార్థులు 22890 మంది హాజరు కావాల్సి ఉండగా 22,786 మంది మాత్రమే హాజరైయ్యారని అన్నారు. విద్యార్థులు హజరు 99.55% శాతంగా నమోదు అయిందని, పరీక్ష సజావుగా జరిగిందని తెలియజేసారు.
Similar News
News February 23, 2026
బోద నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలో బోద (ఫైలేరియా) నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. గుర్ల మండలంలో ఇప్పటివరకు 5,516 మందికి డీఈసీ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 7,710 మందికి మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
News February 23, 2026
VZM: ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 20,430 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 19,568 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 862 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
News February 23, 2026
VZM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్.పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించి, వారికి కల్పించిన వసతులపై అధికారులను ఆరా తీశారు.


