News March 25, 2024

సీమలో రెండు చోట్లే..

image

AP: వచ్చే ఎన్నికల్లో జనసేన 21 చోట్ల పోటీ చేస్తోంది. ఇందులో సింహభాగం సీట్లు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఉన్నాయి. రాయలసీమలో తిరుపతి, రైల్వే కోడూరు స్థానాల్లోనే బరిలోకి దిగుతోంది. 2009లో తిరుపతిలో చిరంజీవి నెగ్గారు. 2019లో జనసేన నేత చదలవాడ కృష్ణమూర్తికి 12,315 ఓట్లే పోలయ్యాయి. రైల్వేకోడూరులో గతంలో PRP అభ్యర్థికి 22వేల చిలుకు ఓట్లు రాగా.. 2019లో జనసేన క్యాండెట్‌కు 9,964 ఓట్లే వచ్చాయి.

Similar News

News April 19, 2025

పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష

image

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని హీరోయిన్ త్రిష అన్నారు. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. కాగా త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లోనూ ఆమె కనిపించనున్నారు.

News April 19, 2025

మామిడి పండ్లు తింటున్నారా?

image

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తుచ్చేది మామిడి పండ్లే. అయితే, కార్బైడ్‌‌తో మాగించిన పండ్లను తింటే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత మంచినీటితో కడిగి, ఆపై తుడిచి తినాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తొక్కను తినకపోవడమే బెటర్ అని చెబుతున్నారు. కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిదంటున్నారు.

News April 19, 2025

2వేల మందిపై ఇవే చర్యలుంటాయా?: IAS స్మితా

image

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో AI ఎడిటెడ్ ఫొటోను రీట్వీట్ చేసినందుకు పోలీసులిచ్చిన <<16116901>>నోటీసులపై<<>> IAS స్మితా సబర్వాల్‌ స్పందించారు. ఇవాళ పోలీసులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘ఈ పోస్టును షేర్ చేసిన 2వేల మందిపై ఒకే విధమైన చర్యలుంటాయా? అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. అప్పుడు చట్టంముందు అందరూ సమానులే అన్న సూత్రం రాజీపడినట్లవుతుంది’ అని రాసుకొచ్చారు.

error: Content is protected !!