News March 24, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు 90.94% హాజరు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి ఎం.రమేష్ తెలిపారు. మొత్తం 41 సెంటర్లలో బాలురు 2,975, బాలికలు 3,231కు మొత్తం 6,206 గాను… బాలురు 2,973, బాలికలు 3,229 హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 90.94% హాజరయ్యారు.

Similar News

News September 17, 2025

సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన చైనా ప్రతినిధి బృందం

image

అనంతపురం జిల్లా జంతలూరులోని AP సెంట్రల్ యూనివర్సిటీని న్యూఢిల్లీ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. కౌన్సిలర్ యాంగ్ షీయుహువా, జాంగ్ హైలిన్, సూ చెన్, ఫాంగ్ బిన్ CUAP ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరిని కలిశారు. విద్యలో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థులకు చైనా విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ఉపకారవేతన పథకాల గురించి వివరించారు.

News September 17, 2025

జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన విశాఖ మేయర్

image

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో భాగంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బుధవారం సందర్శించారు. జైపూర్ మేయర్ డా.సౌమ్య గుర్జర్‌ను శాలువ వేసి సత్కరించగా, ఆమె కూడా విశాఖ మేయర్‌కు మెమెంటో అందించారు. జైపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ విధానాలు, టూరిజం చర్యలపై అధికారులు వివరాలు అందించారు.

News September 17, 2025

సౌదాగర్ అరవింద్‌ను బహిష్కరించాం: TPCC చీఫ్

image

జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ SC సెల్ ఛైర్మన్‌గా చలామణి అవుతున్న సౌదాగర్ అరవింద్‌కు పార్టీలో ఎలాంటి పదవి లేదని, ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఈ కారణంగా అతడిని పార్టీ నుంచి బహిష్కరించామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.