News March 24, 2025

NGKL: మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన ఎంపీలు

image

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులు డాక్టర్ మల్లురవి సోమవారం దిల్లీలో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలను ఖర్గేకు ఆయన వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయం గుర్తు చేశారు.

Similar News

News November 10, 2025

గద్వాల డీసీసీ అధ్యక్ష సీటు ఎవరికి?

image

నడిగడ్డలో గద్వాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవిపై చర్చ నడుస్తోంది. ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి, సెక్రటరీ సంపత్ కుమార్ పార్టీ శ్రేణుల అభిప్రాయాలు స్వీకరించారు. అధ్యక్ష పదవికి 13 మంది దరఖాస్తు చేసుకోగా, రాజీవ్ రెడ్డి, నల్లారెడ్డి, తిరుపతయ్య పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది.

News November 10, 2025

ఏపీ టుడే

image

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.

News November 10, 2025

వరంగల్‌ ప్రజలు ఈ వారం జాగ్రత్త

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 నుంచి వారం రోజులపాటు చలి పంజా విసరనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 11 నుండి 19 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో 11 నుంచి14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు, మహబూబాబాద్ జిల్లాలో 14 నుంచి 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. వృద్దులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.