News March 24, 2025

నెల్లూరు: ఆన్‌లైన్‌లో పరిచయం.. రూ.18 లక్షల మోసం

image

హనీ‌ట్రాప్‌కు గురై ఓ వ్యక్తి రూ.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాడుకు చెందిన తనకు ఆన్లైన్ ద్వారా దుర్గాభవాని అనే మహిళ పరిచయమైందని, అనారోగ్యంగా ఉందని నమ్మించి తన దగ్గర రూ.18 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ మేరకు సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News December 30, 2025

సందిగ్ధంలో గూడూరు సబ్ కలెక్టర్ పోస్టు..?

image

గూడూరు సబ్ కలెక్టర్ పోస్టుకు మోక్షం కలగడం లేదు. ఇక్కడ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన రాఘవేంద్ర మీనన్ బదిలీ అయి 2 నెలలు గడుస్తోన్నప్పట్నుంచి ఇంచార్జిగా శ్రీకాళహస్తి RDO భానుప్రకాష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన రెండు చోట్ల విధులు నిర్వహించాల్సి రావడంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడంలో ఆలస్యం నెలకొంది. గూడూరు నెల్లూరులో కలిపిన తరువాత అయినా.. పోస్టును భర్తీ చేయాల్సి ఉంది.

News December 30, 2025

నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

image

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.

News December 30, 2025

నెల్లూరు: వారి మధ్య విభేదాలు లేనట్టేనా ?

image

కావలిలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి మధ్య వైరం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. బీదకు TDP అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత MLA దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కావ్య బీద రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి మధ్య వైర ఉందా.. లేదా..? అనేదానికి చెక్ పెడతారా..?అనేది చూడాల్సి ఉంది.